ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నవంబరులో లండన్లో పర్యటించనున్నారు. మోడీ పర్యటన చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా ఉండాలని కోరుకుంటున్నామని.. ఈ క్రమంలో వచ్చేనెల 13న వాంబ్లే స్టేడియంలో మోడీకి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్ఆర్ఐల కమిటీ ప్రతినిధి మయూరి పార్మర్ వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే లండన్లో మోడీ ఎక్స్ప్రెస్ను పచ్చజెండా ఊపి ప్రారంభించినట్లు పార్మర్ చెప్పారు.