మృతులను ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెంకు చెందిన నర్రా హనుమంతరావు భార్య శశికళ (40), కుమారుడు అనీష్ సాయి(7)గా గుర్తించారు. హనుమంతరావు, శశికళకు 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరు అమెరికాలో తొమ్మిదేళ్లుగా నివసిస్తున్నారు. హనుమంతరావు ఓ కంపెనీలో అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తుండగా.. శశికళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు.
బుధవారం సాయంత్రం శశికళ బాబును స్కూల్ నుంచి తీసుకొచ్చారు. సాయంత్రం ఏడు గంటలకు హనుమంతరావు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి భార్య, కుమారుడు విగతజీవులుగా కనిపించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.