అమెకాలో కేరళ వైద్యురాలికి అరుదైన గౌరవం

మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (17:56 IST)
కరోనా వైరస్ బాధిత దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా ఒకటి. ఈ దేశ వాణిజ్య నగరమైన న్యూయార్క్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేసింది. ఇప్పటికి కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పురాలేదు. అయినప్పటికీ కరోనా వైరస్ కట్టడికి ఆ దేశ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇండో - అమెరికన్ వైద్యురాలికి ఓ అరుదైన గౌరవం లభించింది. కరోనా వైరస్ రోగులకు చికిత్స చేసినందుకుగాను ఆమెకు ఈ గౌరవం దక్కిది. అదీ కూడా వంద కార్ల ర్యాలీతో సెల్యూట్ ప్యారెడ్ నిర్వహించారు. 
 
ఈ వైద్యురాలు అమెరికాలోని సౌత్ విండర్స్ ఆస్పత్రిలో పని చేస్తోంది. మైసూర్‌కు చెందిన ఈ వైద్యురాలి పేరు డాక్టర్ ఉమా మధుసూదనన్. అమెరికాలో స్థిరపడిపోయారు. ఈమె కరోనా రోగులకు వైద్యం చేసినందుకుగాను... ఆమె ఇంటి ముందు నుంచి వందకార్లు వెళుతూ, కొన్ని నిమిషాల పాటు ఆపి సెల్యూట్ చేశారు. 
 
ఈ కార్ల ర్యాలీలో అనేక పోలీసు వాహనాలతో పాటు ఫైర్ బ్రిగేడ్ ట్రక్కులు, ప్రైవేట్ వాహనాలు కూడా ఉన్నాయి. కనీసం 100 వాహనాల కాన్వాయ్ డాక్టర్ ఉమా ఇంటిని కొన్ని సెకన్ల పాటు ఆపి, ఆమెకు కృతజ్ఞతలు తెలిపింది.

 
 

Dr Uma Madhusudan, an Indian doctor, was saluted in a unique way in front of her house in USA in recognition of her selfless service treating Covid patients pic.twitter.com/Hg62FSwzsP

— Harsh Goenka (@hvgoenka) April 20, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు