టాంజానియాకు వెళ్లిన 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా'.. ఏంటి సంగతి? (video)

మంగళవారం, 18 జనవరి 2022 (21:27 IST)
టాంజానియా సోషల్ మీడియా స్టార్ కిలి పాల్ 'ఊ అంటావా' పాటకు స్టెప్పులేసి, ఆ వీడియోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. కొద్ది వ్యవధిలోనే ఈ వీడియో వైరల్ అయింది. లక్షల్లో లైకులు లభించాయి. కిలి పాల్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్ ఉంది. అతడి ఖాతాకు 1.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
 
కాగా అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుప్ప చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. ఇందులోని పాటలు ఆడియన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి. ముఖ్యంగా, సమంత నటించిన 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా' పాటకు విశేష ప్రజాదరణ లభిస్తోంది. తాజాగా ఈ పాట ఆఫ్రికా దేశం టాంజానియా వరకు పాకిపోయింది.
 
ఇప్పటికే ఊ అంటావా? పాట మీద లెక్కలేనన్ని కవర్ సాంగ్స్ వచ్చాయి. ఇప్పటికే అషూ రెడ్డి ఎంతో ఖర్చు పెట్టి కూడా రీక్రియేట్ చేసేందుకు ట్రై చేసింది. సమంతలానే కాస్టూమ్స్, స్టెప్పులు వేసింది. అయితే సమంతలోని మ్యాజిక్‌ను తీసుకురావడం అంత ఈజీ కాదు. తాజాగా నటి ప్రగతి కూడా ఊ అంటావా? అనే పాటకు కాలు కదిపింది. ఈ వీడియో కూడా నెట్టింటిని షేక్ చేస్తోంది. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు