పాకిస్థాన్లో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఆమె కుటుంబసభ్యులు దారుణంగా ప్రవర్తించారు. 15 ఏళ్ల అబ్బాయి మర్మాంగాన్ని కోసి, కళ్లను పీకేసిన ఘటన పంజాబ్ ప్రావిన్స్లో చోటుచేసుకుంది. బాలుడి కుటుంబ సభ్యులు నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. పాకిస్తాన్లో అధికార పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్) నేత ఒకరు నిందితుడికి మద్దతుగా ఉన్నారని బాలుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. గత ఫిబ్రవరిలో స్థానికంగా తొమ్మిదో తరగత చదువుతున్న అబ్బాయిని అమ్మాయి తండ్రి తన అనుచరులతో కలిసి స్కూల్ నుంచి కిడ్నాప్ చేశాడు. తన కుమార్తెతో అక్రమ సంబంధం నెరపుతున్నాడని అనుమానంతో అతని మర్మాంగాన్ని కోసేశాడు. కళ్లను పీకేసి పరారైనాడు. స్థానికులు అతనికి చికిత్స అందించిన వైద్యులు బాలుడి ప్రాణానికి ప్రమాదం లేకపోయినా చూపు కోల్పోయాడని తెలిపారు.