పాకిస్థాన్‌లో దారుణం... 23 మందిని కాల్చి చంపిన బీఎల్ఏ ఉగ్రవాదులు

ఠాగూర్

సోమవారం, 26 ఆగస్టు 2024 (13:15 IST)
పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. ఆ దేశంలోని బలూచిస్థాన్ ప్రావిన్సులోని ముసాఖైల్ జిల్లా ఈ దారుణం వెలుగు చూసింది. పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రం నుంచి వస్తున్న వాహనాల్లోని వారిని కిందకు దించి ఉగ్రవాదాలు కాల్చి చంపారు. మొత్తం 23 మందిని హత్య చేశారు. మరో పది వాహనాలకు నిప్పు అంటించారు. 
 
బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సులు, ట్రక్కులు, వ్యాన్లను ఆపిన ఉగ్రవాదులు అందులోని ప్రయాణికులను తనిఖీ చేసి తమ జాతి కాని వారిని కాల్చి చంపేశారు. పంజాప్ నుంచి వస్తున్న వాహనాలను ఆపి ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఏకంగా పది వాహనాలకు నిప్పు పెట్టారు. 
 
ఈ దారుణం ఘటన వెనుక బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఈ గ్రూపు చాలా బలంగా విస్తరించివుంది. ఈ ఘటనను బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టి ఖండించారు. బాధిత కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ఘటన వెనకున్న ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారి తప్పించుకోలేరని తేల్చి చెప్పారు. అయితే, ఈ కాల్చివేత ఘటనకు సంబధించి బీఎల్ఏ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు