ఈజిప్టు పర్యటనకు ప్రధాని.. వీడియోను షేర్ చేసిన మోదీ

శనివారం, 24 జూన్ 2023 (14:12 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు ఈజిప్టులో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ మూడు రోజుల అమెరికా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. మరోవైపు ప్రధాన మంత్రి ఈజిప్టుకు ప్రయాణం అయ్యారు. ఈజిప్టు పర్యటనకు ముందు.. అమెరికా పర్యటన విజయవంతంపై ప్రధాని మోడీ కీలక వీడియోను పంచుకున్నారు.  
 
ఇక మోదీ రాక కోసం ఈజిప్ట్‌ ప్రెసిడెంట్‌ అబ్దుల్‌ ఫతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపుగా మూడు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఈజిప్టులో పర్యటించడం ఇదే తొలిసారిగా చెప్తున్నారు. ఈజిప్ట్ చేరుకున్న తర్వాత ప్రధాని మోడీ అక్కడి నాయకులు, ప్రవాస భారతీయులతో వరుసగా భేటీ కానున్నారు. దాదాపు అరగంటపాటు అల్-హకీమ్ మసీదులో గడపనున్నారు. 
 
తన ఈజిప్ట్ పర్యటన సందర్భంగా, ప్రధాని మోడీ మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్ట్ కోసం అత్యున్నత త్యాగం చేసిన భారతీయ సైనికులకు నివాళులు అర్పించేందుకు హెలియోపోలిస్ వార్ గ్రేవ్ స్మశానవాటికను కూడా సందర్శించనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు