భారత ఆర్మీ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టిందా లేదా? అనే అనుమానాన్ని ఐరాస వ్యక్తం చేయడంతో పాటు.. భారత సైన్యం అసలు సర్జికల్ స్ట్రైక్స్ చేయలేదని పాకిస్థాన్ మీడియా దుష్ప్రచారం చేస్తోంది. స్వదేశంలోని కొందరు రాజకీయ నేతలు కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని భారత ఆర్మీపై రాజకీయ బురద చల్లుతున్నారు. వీరందరికీ కాశ్మీర్ ప్రజలు సరైన షాక్ ఇచ్చారు. భారత సైన్యం జరిపిన దాడులను తాము కళ్లారా చూశామని చెప్పారు.