పాకిస్థాన్ వ్యక్తి హైదరాబాద్ మహిళను చిత్రహింసలకు గురిచేశాడు. నీ గొంతులో ప్రాణం ఉండగా.. నిన్ను భారత్కు పంపించే ప్రసక్తే లేదని ఆ మహిళను గదిలో నిర్భంధించాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదీ అమ్మాయి అయిన బేగంను పాకిస్థాన్ వ్యక్తి మహ్మద్ యూనిస్ మోసగించి పెళ్లి చేసుకున్నాడు. ఆపై పిల్లలు పుట్టాక.. ఆమెను భారత్కు పంపించేది లేదని చెప్పేశాడు. పిల్లల్ని కూడా ఆమెకు దూరంగా ఉండాల్సిందిగా షరతు విధించాడు.
1996లో బేగంను ఓ సైకిల్ మెకానిక్ అయిన యూనిస్ పెళ్లాడాడు. ఓ ఏజెంట్ ద్వారా ఇద్దరికీ ఫోన్లోనే నిఖా జరిపించారు. ఆ వెంటనే భర్తతో కలిసి ఉండేందుకు మహమ్మదీ బేగం మస్కట్కు వెళ్లింది. కానీ కొన్నేళ్ల తర్వాతే అతడు పాకిస్థాన్ జాతీయుడని బేగంకు తెలిసింది. ఆపై బలవంతంగా పాకిస్థాన్కు తీసుకెళ్లాడు. అప్పటి నుంచి భర్త, అత్తామామలు.. మహమ్మదీ బేగంను శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అత్తింటి చెర నుంచి తన కూతురిని విడిపించి, భారతకు రప్పించాలంటూ గత జనవరిలో కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్కు ఈ-మెయిల్ ద్వారా బేగం తండ్రి అక్బర్ విజ్ఞప్తి చేశాడు. దీంతో బేగంను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని అక్బర్కు కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా సుష్మ స్వరాజ్ ఆదేశాల మేరకు పాక్లో భారత రాయబార కార్యాలయ అధికారులు మహ్మదీబేగంను కలిశారు.