ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. తాలిబన్ల కీలక ప్రకటన

శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (20:50 IST)
ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో తాలిబన్లు కీలక ప్రకటన చేసింది. భారత ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపాలని కోరిన సంగతి తెలిసిందే.
 
తాజాగా ఈ అంశంపై ఆఫ్ఘనిస్థాన్‌ను‌ పాలిస్తున్న తాలిబన్లు సైతం స్పందించారు. రెండు దేశాలు సంయమనాన్ని పాటించాలని తాలిబన్ ప్రభుత్వం ఓ ప్రకటనలో కోరింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. 
 
ఉక్రెయిన్‌లో తమ విద్యార్థులు చదువుకుంటున్నారన్న తాలిబన్లు... విద్యార్థుల రక్షణపై ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం వల్ల ప్రాణాలు కోల్పోతున్న ప్రజల గురించి ఆవేదన వ్యక్తం చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు