శవాన్ని హెలికాప్టర్‌కు కట్టి కాందహార్‌లో విహరించారు..

బుధవారం, 1 సెప్టెంబరు 2021 (15:31 IST)
తాలిబన్ల ఆప్ఘన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా వుంటున్నా వారి అరాచకాలకు బ్రేక్ పడటం లేదు. అఫ్గాన్‌ నుంచి అమెరికా సైన్యం వెనుదిరగ్గానే కాబూల్‌ ఎయిర్‌పోర్టును ఆక్రమించుకున్నారు. తాజాగా మంగళవారం ఓ వ్యక్తి శవాన్ని హెలికాప్టర్‌కు కట్టి కాందహార్‌లో విహరించారు. 
 
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో యావత్ ప్రపంచం వీరి ఆగడాలకు హడలిపోతుంది. అఫ్గాన్‌ను విడిచి వెళ్లే క్రమంలో కొన్ని ఆయుధాలను అమెరికా సైన్యం వదిలేసిపోయింది. అందులో హెలికాప్టర్ కూడా ఉండటంతో దానితోనే తాలిబన్లు కాందహార్‌లో విహరించారు.
 
ఆ హెలికాప్టర్‌కు వ్యక్తిని తాడుతో వేలాడదీసి గాల్లో ఎగురుతున్న వీడియోను పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేసి.. అది మృతదేహమేనని, చంపిన తర్వాతే తాలిబన్లు ఇలా చేశారంటూ పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇదంతా అమెరికా తప్పిదమేనని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
 
సోమవారం అర్ధరాత్రే అగ్రరాజ్య దళాలు హడావుడిగా నిష్క్రమించాయి. తాము వెళ్లేముందే అక్కడున్న ఆయుధాలన్నింటినీ నిర్వీర్యం చేశామని పేర్కొన్నప్పటికీ.. సాధ్యం కాలేదని స్థానిక మీడియా వర్గాలు ఆరోపిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు