ఈ పేలుళ్ళపై టర్కీ స్వదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం... ఈ ఘటనలో ఇప్పటివరకు 86 మంది చనిపోయారని, 126 మంది వరకు గాయపడినట్టు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రులకు తరలించారు. అయితే ఇవి ఆత్మాహుతి దాడులా, బాంబు దాడులా ఇంకా తెలియరాలేదని తెలిపింది. నవంబర్ 1 నుంచి టర్కీలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ పేలుళ్ళు జరగడం గమనార్హం.