ఆ దేశంలో 'కరోనా' అనే పదం ఉచ్ఛరిస్తే జైలుకే... ఎక్కడ?

గురువారం, 2 ఏప్రియల్ 2020 (09:58 IST)
ప్రపంచమంతా కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతోంది. పలువా వంటి ద్వీపాల్లో మాత్రం కరోనా వైరస్ అడుగుపెట్టేందుకు భయపడుతున్నాయి. దీనికి కారణం ఆయా ద్వీపాలు గత జనవరి నుంచే కఠినమైన చర్యలు తీసుకున్నాయి. ఆంక్షలు కఠినతరం చేశాయి. రాకపోకలు బంద్ చేశాయి. ఫలితంగా పలువా వంటి ద్వీపాల్లో ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా ఇంతవరకు నమోదు కాలేదు. 
 
ఇపుడు ప్రపంచ దేశాల్లో తుర్కెమెనిస్థాన్ ఒకటి. ఇక్కడ కూడా ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదు. అందుకే కరోనా అన్న పదం కూడా తమ దేశంలో వినిపించకుండా చేసింది. ఈ వైరస్ గురించి సోషల్ మీడియాలో చర్చించడాన్ని కూడా నిషేధించింది. మీడియా వార్తల్లో, ఆరోగ్య శాఖ పంపిణీ చేసే సమాచార పత్రాల్లోనూ ఈ పదం కనిపించరాదని ఆదేశించింది.
 
ఇక ప్రజలు ఎవరైనా కరోనా గురించి మాట్లాడితే, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇందుకోసం మఫ్టీలో సాధారణ దుస్తుల్లోనే ప్రభుత్వ ఏజెంట్లు ప్రజల మధ్య తిరుగుతున్నారు. రహస్యంగా ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారన్నది గమనించడమే వీరి విధి. వైరస్, దాని వ్యాప్తి గురించి మాట్లాడితే, ఇక అంతే. ఇక వైరస్ గురించిన సమాచారం ఇక్కడి ప్రజలకు అంతంతమాత్రంగానే తెలుసు.
 
కాగా, ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాకపోయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం, ఇప్పటికే పౌర ఉద్యమాలను నిషేధించిన సర్కారు, రద్దీ అధికంగా ఉండే ప్రదేశాలను రసాయనాలతో శుభ్రం చేస్తున్నారు. తుర్కెమెనిస్థాన్ అధ్యక్షుడు గుర్బాంగులీ బైర్దేముకామెడోవ్, తమ దేశ ప్రజలు వైరస్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు