విదేశీ ప్రయాణాలపై యూఏఈ కీలక నిర్ణయం : నేటి నుంచి అనుమ‌తి

మంగళవారం, 23 జూన్ 2020 (09:41 IST)
లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశ పౌరుల‌ను విదేశీ ప్ర‌యాణాల‌కు అనుమ‌తి ఇవ్వ‌ని యూఏఈ తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నేటి నుంచి దేశ పౌరుల‌ను విదేశీ ప్ర‌యాణాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తు.. కీలక నిర్ణయం తీసుకుంది.

ప్ర‌భుత్వం అనుమ‌తి పొంది.ఎంపిక కాబ‌డిన పౌరులు, నివాసితుల‌ను కొన్ని గమ్యస్థానాలకు వెళ్లడానికి యూఏఈ అనుమ‌తించ‌నుంది. జ‌ర్నీ స‌మ‌యంలో ప్ర‌యాణికులు త‌ప్ప‌నిస‌రిగా క‌రోనా నియంత్ర‌ణకు సంబంధించిన‌ నియమ నిబంధ‌న‌లు పాటించాల్సి ఉంటుంది.

ఈ మేర‌కు సంయుక్తంగా విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మ‌రియు ఇంట‌ర్నెష‌న‌ల్ కోఆప‌రేష‌న్, ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ (ఐసీఏ), నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎన్‌సీఈఎంఏ) ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు