డబుల్ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నవారికి అమెరికా శుభవార్త

మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (07:44 IST)
అగ్రరాజ్యం అమెరికా మరోమారు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇందుకోసం ప్రతి ఒక్క వ్యక్తి విధిగా వ్యాక్సిన్ వేసుకోవాల్సిన వుంది. అలా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికి అమెరికా శుభవార్త చెప్పింది. 
 
తమ దేశానికి వచ్చే ప్రయాణికుల వ్యాక్సినేషన్ పూర్తయిన పక్షంలో వారికి అనుమతులు ఇస్తామని ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలో గడిచిన 18 నెలలుగా అంతర్జాతీయ ప్రయాణికులపై నిషేధం కొనసాగుతోంది. ఈ నిషేధాన్ని నవంబరు నెలలో తొలగించాలని బైడెన్ సర్కారు నిర్ణయించింది.
 
ఈ విషయాన్ని బైడెన్ ప్రభుత్వంలో కరోనా రెస్పాన్స్ కోఆర్డినేటర్‌గా ఉన్న జెఫ్రీ జియెంట్స్ వెల్లడించారు. ట్రంప్ హయాంలో విధించిన ఈ అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధాన్ని నవంబరులో తొలగిస్తామని జెఫ్రీ తెలిపారు. అయితే కరోనా నియంత్రణ కోసం పలు భద్రతా చర్యలు మాత్రం అమలవుతాయని ఆయన స్పష్టం చేశారు. విదేశాల నుంచి అమెరికా వచ్చే ప్రయాణికుల వ్యాక్సినేషన్ పూర్తయ్యి ఉండాలని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు