ఆఫ్గనిస్థాన్‌లో పేలుళ్ళు: 30 మంది మృతి

దక్షిణ ఆఫ్గనిస్థాన్‌లోని కాందహార్ ప్రాంతంలో మంగళవారం ఓ బస్సు పేలిపోవడంతో అందులోనున్న దాదాపు 30 మంది మృతి చెందారు.

కాందహార్ ప్రాంతంలో ఓ బస్సు పేలిపోవడంతో 30 మంది మృతి చెందినట్లు ఆఫ్గనిస్థాన్ హోంశాఖ తెలిపింది. ఇందులో పది మంది పిల్లలు, ఏడుగురు మహిళలు కూడా ఉన్నారని, మరో 39 మంది తీవ్ర గాయాల పాలైనట్లు ఆ శాఖ తెలిపింది.

ఈ దాడులు తాలిబన్ ఉగ్రవాదులే చేసి ఉంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

వెబ్దునియా పై చదవండి