ఔట్ అంటే ఔటే... అది క్యాచ్ అయినా.. ఎల్బీడబ్ల్యూ అయినా? ధోనీ వైఫ్ ట్వీట్.. (video)

గురువారం, 24 సెప్టెంబరు 2020 (09:05 IST)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సాక్షి ధోనీ ఓ ట్వీట్ చేసింది. ఐపీఎల్ 2020 టోర్నీలో దొర్లుతున్న ఫీల్డ్ అంపైర్ తప్పిదాలను విమర్శిస్తూ ఆమె చేసిన ట్వీట్ ఇపుడు వైరల్ అయింది. నిజానికి ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికి దాన్ని ఆమె డిలీట్ చేసింది. కానీ, అది అప్పటికే వైరల్ అయింది. తన ట్వీట్‌లో ఆమె అంపైర్ల తీరును ఎండగట్టారు. అంతేకాకుండా ఐపీఎల్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో అంపైరింగ్ మరింత నాణ్యవంతంగా ఉండాలంటూ అభిప్రాయపడ్డారు. 
 
ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య నాలుగో లీగ్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఆటగాడు టామ్‌ కరన్‌ను ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌‌గా ప్రకటించారు. ఆ తర్వాత ఫీల్డ్ అంపైర్లు ఇద్దరూ సమీక్షించుకొని థర్డ్ అంపైర్‌‌కు నివేదించారు. థర్డ్ అంపైర్ నిశితంగా పరిశీలించి కరన్‌ను నాటౌట్‌‌గా ప్రకటించాడు. ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్ జట్టు భారీ స్కోరు చేసింది. 
 
దీనిపై ఇన్‌‌స్టాగ్రామ్, ట్విట్టర్‌‌లలో స్పందించిన సాక్షి ధోనీ... సాంకేతికతనే వాడాలనుకుంటే సరిగ్గా వాడాలని అభిప్రాయపడింది. "ఔట్‌ అంటే ఔటే. అది క్యాచ్‌ అయినా ఎల్బీడబ్ల్యూ అయినా? ఔటిచ్చాక తిరిగి మూడో అంపైర్‌కు నివేదించడాన్ని తొలిసారి చూస్తున్నా" అని పేర్కొంది. 
 
కోట్ల మంది వీక్షించే ఐపీఎల్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో అంపైరింగ్‌ మరింత నాణ్యంగా ఉండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పోస్ట్ పెట్టిన నిమిషాల వ్యవధిలోనే వాటిని ఆమె తొలగించడం గమనార్హం. పంజాబ్ కింగ్స్ లెవెన్ మ్యాచ్‌లో కూడా ఫీల్డ్ అంపైర్ ఓ రన్ కట్ చేయడంతో ఆ మ్యాచ్‌లో ఆ జట్టు ఓడిపోయిన విషయం తెల్సిందే.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు