ఎయిర్‌టెల్ బ్లాస్టింగ్ ఆఫర్.. రూ.9కే ఉచిత ఫోన్ కాల్స్

శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (16:14 IST)
దేశంలోని ప్రైవేట్ టెలికాం దిగ్గజంగా ఉన్న ఎయిర్‌టెల్ బ్లాస్టింగ్ ఆఫర్‌ను ప్రకటించింది. తన ప్రత్యర్థి రిలయన్స్ జియోకు దిమ్మతిరిగిపోయేలా ఈ ఆఫర్ ఉంది. అంటే కేవలం 9 రూపాయలకే ఉచిత ఫోన్ కాల్స్ సౌకర్యాన్ని కల్పించనుంది. దీని కాలపరిమితి ఒక్క రోజు మాత్రమే. 
 
ఇటీవల రిలయన్స్ జియో కేవలం 19 రూపాయలకు ఈ తరహా ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీన్ని తలదన్నేలా రూ.9కే రోజంతా అపరిమితంగా కాల్స్ చేసుకునేలా ఎంట్రీ లెవల్ రీచార్జ్ ప్యాక్‌ను ప్రకటించింది. ఈ ప్యాక్‌లో భాగంగా ఒక రోజు కాలపరిమితితో అపరిమిత కాల్స్, 100 ఎంబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు పొందవచ్చు. 
 
కాగా, రిలయన్స్ జియో రూ.19 ప్యాక్‌లో వినియోగదారులకు ఒక రోజు కాలపరిమితితో అపరిమిత కాల్స్, 20 ఎస్సెమ్మెస్‌లు, 150 ఎంబీ డేటా లభిస్తుండగా ఎయిర్‌టెల్‌ రూ.9 ప్యాక్‌లో అపరిమిత కాల్స్‌తోపాటు 100 ఎంబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు