దేశంలోనే తొలి 3డీ గృహం.. ఆనంద్ మహీంద్రా ఆసక్తి

సోమవారం, 31 జనవరి 2022 (23:19 IST)
3D printed home
దేశంలోనే తొలి 3డీ గృహాన్ని ఏర్పాటు చేసే దిశగా మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంకా 21 రోజుల్లో ఈ నిర్మాణం చేపట్టాలని మహీంద్రా గ్రూప్ చెప్తోంది.
 
ముంబైకి చెందిన బిజినెస్ మొగల్ ఐఐటీ మద్రాస్ మద్దతుగల స్టార్ట్అప్ త్వాస్తా 21 రోజుల్లో నిర్మించిన భారతదేశపు మొదటి 3డి ప్రింటెడ్ ఇంటికి సంబంధించిన ఒక 104 సెకన్ల నిడివి గల వీడియోను ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
 
ప్రపంచవ్యాప్తంగా 3డి ప్రింటెడ్ గృహా రంగంలో జరుగుతున్న పరిణామాలను తాను అనుసరిస్తున్నానని, ఈ రంగంలో స్వదేశంలో అభివృద్ది చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం భారతదేశానికి కీలకమని మహీంద్రా అన్నారు. 
 
ఐటి మద్రాస్ మద్దతుతో వచ్చిన టెక్ కంపెనీ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ది చేయడం భారతదేశానికి చాలా అవసరమని తెలిపారు.

Been following developments in 3D printed homes overseas. Critical for India so delighted to see home-grown tech from IIT Madras (now one of the world’s leading Tech-Incubators) I know you guys raised some seed funding, but any room for me to join in? pic.twitter.com/LXoZCMAwM8

— anand mahindra (@anandmahindra) January 31, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు