పీవీసీ సిమ్ కార్డ్‌లకు మారిన భారతి ఎయిర్‌టెల్

సెల్వి

బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (15:52 IST)
భారతి ఎయిర్‌టెల్ భారతదేశంలోని ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటి. వర్జిన్ ప్లాస్టిక్ నుండి రీసైకిల్ చేయబడిన పీవీసీ సిమ్ కార్డ్‌లకు మారినట్లు ప్రకటించింది. భారతదేశంలో  రీసైకిల్ ప్లాస్టిక్ సిమ్ కార్డ్‌లకు మారిన ఏకైక టెలికమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ ఎయిర్‌టెల్. 
 
వర్జిన్ ప్లాస్టిక్ సిమ్ కార్డ్‌లను ఉపయోగించకుండా రీసైకిల్ చేసిన పివిసి సిమ్ కార్డ్‌లకు మారడానికి టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఐడెమియా సెక్యూర్ ట్రాన్సాక్షన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు టెలికాం మేజర్ భారతీ ఎయిర్‌టెల్ బుధవారం తెలిపింది.
 
ఇది రీసైకిల్ ప్లాస్టిక్ సిమ్ కార్డ్‌లకు మారిన ఏకైక టెలికమ్యూనికేషన్ కంపెనీగా ఎయిర్‌టెల్ నిలిచింది. " దీంతో 165 టన్నులకు పైగా వర్జిన్ ప్లాస్టిక్ ఉత్పత్తి పరిమితం చేయబడుతుంది. ఇది ఒక సంవత్సరంలో 690 టన్నులకు సమానమైన CO2 ఉత్పత్తిని మరింత తగ్గిస్తుంది" అని కంపెనీ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు