ఇన్ఫోసిస్‌ను గాడిలో పెట్టేందుకే వచ్చా : నందన్ నీలేకని

శుక్రవారం, 25 ఆగస్టు 2017 (12:07 IST)
ఇన్ఫోసిస్ కొత్త ఛైర్మెన్‌గా నందన్ నీలేకని రీ ఎంట్రీ ఇచ్చారు. వ్యవస్థాపకులకు, బోర్డుకు మధ్య ఉన్న విభేదాలను చక్కదిద్దడానికి ఇన్ఫోసిస్‌ కొత్త చైర్మన్‌గా నందన్‌ నిలేకని రీఎంట్రీ ఇచ్చారు. ఆర్‌.శేషసాయి స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. గురువారం ఇన్ఫోసిస్‌లోకి పునరాగమనం చేసిన తర్వాత మొట్టమొదటిసారి శుక్రవారం నిలేకని ఇన్వెస్టర్లకు భరోసా కల్పిస్తూ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 
 
వ్యవస్థాపకులకు, కంపెనీకి మధ్య స్థిరత్వం సంపాదించడమే లక్ష్యంగా తాను ఇన్ఫీలోకి అడుగుపెట్టినట్టు నిలేకని చెప్పారు. కంపెనీని గాడిపెట్టిన అనంతరమే తాను ఇన్ఫీ నుంచి నిష్క్రమిస్తానని తెలిపారు. నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా తన పాత్ర బోర్డు పర్యవేక్షణ, పాలన, పనితీరు పరంగా ఉంటుందన్నారు.
 
విశాల్‌ సిక్కా రాజీనామా అనంతరం ఆ పదవిలోకి తీసుకురాబోయే కొత్త సీఈవోగా కోసం కంపెనీ వెలుపల, లోపల వ్యక్తులను వెతుకుతున్నామని చెప్పారు. కొత్త సీఈవో అందరి వాటాదారులతో మంచి సంబంధాలను కొనసాగిస్తూ టెక్నాలజీ పరంగా బలమైన పట్టు ఉండాలన్నారు. కొత్త సీఈవో ఎంపిక కోసం సెర్చ్‌ కమిటీని త్వరలోనే నియమిస్తామన్నారు. 
  

వెబ్దునియా పై చదవండి