జియోఫోన్ 5జీ ధర రూ.8వేల నుంచి రూ.12వేల వరకు వుండొచ్చు..

బుధవారం, 28 సెప్టెంబరు 2022 (12:36 IST)
JioPhone 5G Price
భారతదేశంలో జియోఫోన్ 5జీ ధర రూ.8వేల నుంచి రూ.12వేల వరకు వుంటుందని అంచనా వేయబడింది. రిలయన్స్ జియో నుండి రాబోయే హ్యాండ్‌సెట్ వివిధ స్క్రీన్ సైజులు, స్పెసిఫికేషన్‌లతో బహుళ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇది హోల్-పంచ్ డిస్ప్లే డిజైన్‌ను కలిగివుంటుంది. 
 
భారతదేశంలో JioPhone 5G ధర ప్రజలను ఆకర్షించే లక్ష్యంతో ఉండవచ్చు. అంతేకాకుండా, Jio ప్రస్తుత హార్డ్‌వేర్ ఆఫర్‌లతో పోల్చితే ఫోన్ నవీకరించబడిన, ఆధునిక డిజైన్‌ను కలిగి ఉంటుందని చెప్పబడింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ఇటీవలి నివేదిక ప్రకారం, రాబోయే JioPhone 5G ధర రూ. 8,000.. రూ.12,000.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు