ఫాస్ట్ చార్జింగ్ సదుపాయంతో ఒప్పో ఎఫ్25 ప్రో

సెల్వి

గురువారం, 29 ఫిబ్రవరి 2024 (19:19 IST)
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ ఒప్పో తన ఎఫ్‌ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఒప్పో ఎఫ్‌25 ప్రో 5జీ పేరుతో మొబైల్‌ని భారత్‌ మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. పాండా గ్లాస్‌ ప్రొటెక్షన్‌తో ఈ ఫోన్‌ వస్తోంది. ఈ ఫోన్‌ ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి. రెండు వేరియంట్లలో ఈ ఫోన్ లభించనుంది. దీని ధరలు 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.23,999గా, 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.28,999గా కంపెనీ నిర్ణయించింది. లావా రెడ్‌, ఓషన్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది. వచ్చే నెల ఐదో తేదీ నుంచి భారతీయ మార్కెట్‌లో ఈ ఫోన్ల విక్రయాలు ప్రారంభంకానున్నాయి. ఒప్పో ఇ-స్టోర్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర రిటైల్‌ దుకాణాల ద్వారా కొనుగోలు చేయొచ్చని కంపెనీ ప్రకటించింది. 
 
ఈ ఫోన్‌లోని ఫీచర్లను పరిశీలిస్తే, ఆండ్రాయిడ్‌ ఆధారిత కలర్‌ ఓఎస్‌ 14.0తో పనిచేస్తుంది. 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌ అమర్చారు. ట్రిపుల్‌ కెమెరాతో ఈ ఫోన్‌ వస్తోంది. వెనకభాగంలో 64 ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ సోనీ ఐఎంఎక్స్355 వైడ్‌ యాంగిల్‌ సెన్సర్‌, 2 ఎంపీ మ్యాక్రో సెన్సార్‌ ఇచ్చారు. సెల్ఫీ కోసం ముందువైపు 32 ఎంపీ కెమెరా అమర్చారు. 
 
ఫోన్‌లో ఇరువైపులా ఉన్న కెమెరాలు 4కె వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్‌ చేస్తాయి. మైక్రో ఎస్‌డీ కార్డ్‌ సాయంతో స్టోరేజీ పెంచుకొనే సదుపాయం ఉంది. యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌, 5జీ, వైఫై 6, బ్లూటూత్‌, జీపీఎస్‌ కనెక్టివిటీ ఉన్నాయి. 5,000mAh బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌ 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 10 నిమిషాల్లో 30 శాతం ఛార్జ్‌ అవుతుందని ఒప్పో పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు