రిలయన్స్ జియో వరల్డ్ రికార్డు... నెలలో 1.60 కోట్ల మంది కస్టమర్లు

సోమవారం, 10 అక్టోబరు 2016 (09:09 IST)
రిలయన్స్ జియో వరల్డ్ రికార్డు సృష్టించింది. దేశంలో జియో సేవలు ప్రారంభమైన ఒక్క నెలలోనే ఏకంగా 1.60 కోట్ల కస్టమర్లను సొంతం చేసుకుంది. తద్వారా అత్యంత వేగవంతంగా ఎక్కువమంది వినియోగదారులను చేర్చుకున్న సంస్థగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని రిలయన్స్ జియో విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, దేశంలో రిలయన్స్ జియో సేవలు సెప్టెంబరులో 4జీ టెక్నాలజీతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సంచలన ఆఫర్లతో ఇతర నెట్‌వర్క్ సంస్థల గుండెల్లో గుబులు పుట్టించింది. ఫలితంగా ఇతర సంస్థలు కూడా రిలయన్స్ జియో బాటలోనే ఆఫర్లు ప్రకటిస్తూ ముందుకు సాగాల్సిన పరిస్థితి నెలకొంది. 

వెబ్దునియా పై చదవండి