జియో మరో బంపర్ ఆఫర్... రోజూ 4.5జీబీ డేటా ఫ్రీ

బుధవారం, 20 జూన్ 2018 (11:22 IST)
టెలికాం రంగ సంచలనం రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. తమ మొబైల్ వినియోగదారులు అడక్కుండానే రోజుకు 4.5జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనుంది. అయితే, ఈ డేటా పొందాలంటే నెలకు రూ.299 ప్లాన్‌లో రీచార్జ్ చేయించుకోవాల్సి ఉంది. ఈ ప్యాక్ కాలపరిమితి 28 రోజులు.
 
అంటే నెలకు రూ.299 ప్యాక్ తీసుకుంటే.. 28 రోజులపాటు ప్రతిరోజు 4.5జీబీ డేటా లభించనుంది. మొత్తంగా 126జీబీ డేటా పొందనున్నారు కస్టమర్లు. మరి ఏ ఇతర కంపెనీ నెట్ వర్క్‌లోనూ ఈ ప్యాక్ రేటులో ఇంత డేటా ఇస్తున్న దాఖలాలు లేవు. డేటా ఎక్కువ ఉపయోగించుకునే వారికి జియోలో ఇది బెస్ట్ ప్యాక్ అంటోంది మార్కెట్. 
 
ఈ ఆఫర్‌ ప్రకటించడానికి గల కారణాలు లేకపోలేదు. త్వరలోనే ఐడియా - వోడాఫోన్ టెలికాం కంపెనీలు ఒక్కటి కానున్నాయి. ఇదే జరిగితే టెలికాం రంగంలో ఐడియా అతి పెద్ద కంపెనీగా అవతరించనుంది. దీంతో ధరల యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. ఐడియా-వొడాఫోన్ విలీనం పూర్తయ్యిందన్న సమాచారం తెలిసిన వెంటనే జియే ఈ తరహా ఆఫర్‌ను ప్రకటించడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు