జియోకు పోటీగా వోడాఫోన్ న్యూప్లాన్

ఆదివారం, 6 మే 2018 (14:10 IST)
టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియోకు దెబ్బకు ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు దిగివస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ధరలను భారీగా తగ్గించింది. అయితే, ఈ ధరల యుద్ధం తగ్గింపులో జియోతో పోటీపడలేక పోతోంది.
 
ఈ నేపథ్యంలో మరో ప్రైవేట్ టెలికాం కంపెనీ వోడాఫోన్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ.349తో వారు రీచార్జి చేసుకుంటే వారికి రోజుకు 3జీబీ 3జీ/4జీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. 
 
ఈ ప్లాన్‌కు వాలిడిటీ 28 రోజులుగా నిర్ణయించింది. అయితే జియోలో ఇంతే మొత్తానికి రీచార్జి చేయించుకునే కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తున్నాయి. కానీ, ఈ ప్లాన్ కాలపరిమితి మాత్రం 70 రోజులు కావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు