భారత మార్కెట్‌లోకి సోనీ ఎక్స్‌పీరియా జడ్ : ధర రూ.38,990

బుధవారం, 6 మార్చి 2013 (16:48 IST)
File
FILE
భారత మార్కెట్‌లోకి ఎట్టకేలకు సోనీ ఎక్స్‌పీరియా జడ్ మొబైల్‌ను ఆవిష్కరించింది. వాటర్ రెసిస్టెంట్, అండ్ డస్ట్ రెసిస్టెంట్‌ ఈ ఫోన్ ప్రత్యేకత. దీని ధర రూ.38,990గా ఉంది. ఈ ఫోన్ మార్చి 12వ తేదీ నుంచి అన్ని స్టోర్లలో విక్రయానికి అందుబాటులోకి రానుంది.

ఈ ఫోనులో కొన్ని విభన్నమైన ప్రత్యేకలతో పాటు.. ప్రతి ఒక్కరూ కోరుకునే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కలిగివుండటం సోనీ ఎక్స్‌పీరియా జడ్ ఫోన్ స్పెషల్ ఫ్యూచర్‌గా చెపుతున్నారు. అయితే, ఈ ఫోన్ ధర రూ.40 వేలుగా ఉన్నప్పటికీ.. ఖచ్చితంగా భారతీయ మొబైల్ మార్కెట్‌ను క్యాష్ చేసుకుంటామని సోనీ కంపెనీ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 4.1 జెల్లీ బీన్, క్వాడ్ కోర్ 1.5 గిగా హెట్జ్ క్రైట్ ప్రాసెస్సర్, 2జీబీ రామ్, 5 అంగుళాల టీఎఫ్‌టీ రియాలిటీ డిస్ప్లే స్కీన్ విత్ బ్రావియా ఇంజిన్, షాపర్ పిక్చర్, బెటర్ క్వాలిటీ13 మెగా పిక్సెల్ రేర్ ఎండ్ స్నాపర్, 2.2 మెగా పిక్సెల్ ఫుల్లీ హెచ్‌డీ ఫ్రంట్ కెమెరా, స్మార్ట్ స్లిమ్ స్మార్ట్‌ఫోన్స్ కంటే.. స్లైట్లీ థిక్కర్, ఎక్స్‌పీరియా జడ్ 7.9 ఎంఎం థిక్నెస్‌ వంటి ప్రత్యేకతలు కలిగి ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి