నేర నన్నవాడు నెరజాణ మహిలోన నేర్తునన్న వాడు నింద జెందు ఊరుకున్న వాడె యుత్తమయోగిరా విశ్వదాభిరామ..! వినురవేమ..!
తాత్పర్యం : తనకు ఏమీ రాదు అని చెప్పుకొనే వాడే నిజంగా తేలివైనవాడు. తనకు అన్నీ వచ్చునని చెప్పుకునేవాడు ఎవరినుంచీ తగిన గౌరవాన్ని పొందలేడు. ఎప్పుడూ మౌనంగా ఉండేవాడే ఉత్తమమైన యోగి అనిపించుకుంటాడు. కాబట్టి తమకే అన్నీ తెలుసని ఎప్పుడూ డాంబికాలకు పోవద్దని ఈ పద్యం ద్వారా చెప్పాడు వేమన.