మహాశివరాత్రి స్పెషల్: జీడిపప్పు బర్ఫీ.. కాజు కట్లీ..

సోమవారం, 16 ఫిబ్రవరి 2015 (18:27 IST)
మహాశివరాత్రి పండుగ కావడంతో మహాదేవునికి ఇంట్లోనే మన చేతులారా నైవేద్యాలను తయారు చేసిపెట్టడం అధిక పుణ్యఫలమిస్తుంది. అందుచేత శివునికి కాజు కట్లీని ఇంట్లోనే తయారు చేసి నైవేద్యంగా పెట్టండి. ఎలా చేయాలంటే.. 
 
కావలసిన పదార్థాలు:
జీడిపప్పు : ఒక కప్పు 
పంచదార : ఒక కప్పు
ఏలకుల పొడి : అర స్పూన్
నీరు : నాలుగు స్పూన్లు
నెయ్యి : ఐదు స్పూన్లు 
 
తయారీ విధానం : స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక జీడిపప్పును సన్నని సెగపై దోరగా వేపుకోవాలి. వేపిన జీడిపప్పును మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. మరో పాత్రలో పంచదార నీటిని చేర్చి పాకం తయారు చేసుకోవాలి. పాకం ఉడికాక అందులో రుబ్బిన జీడిపప్పు పొడి, ఏలకుల పౌడర్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేటులో వేసి 10 నిమిషాల తర్వాత డైమండ్ షేప్‌లో కట్ చేసుకోవాలి

వెబ్దునియా పై చదవండి