ఇంకా మహాశివరాత్రి రోజున మహన్యాసపూర్వకరుద్రాభిషేకం నిర్వర్తించి, 11 మంది వృద్ధ దంపతులకు అన్నదానం, వస్త్ర, దక్షిణలదానం చేసిన వారింట అష్టలక్ష్ములు కొలువైవుంటారు. ఇంకా గోదానము, క్షీరదానం చేసినట్లైతే పదివేల సంవత్సరాలు శివుని సానిధ్యంలో గడిపే అదృష్టం కలుగుతుంది.
ఇదేరోజున శివునికి 11 లీటర్ల ఆవుపాలు, ఆవునెయ్యిలతో మహన్యాసాన్ని జరిపితే అఖండమైన తేజంతో పాటుగా దీర్ఘాయువు కలుగుతుందని పురోహితులు సూచిస్తున్నారు. శివునికి మహాశివరాత్రి రోజున కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా, మారేడు దళములు, నాగమల్లి పువ్వులతో అర్చన చేస్తే శుభ ఫలితాలు చేకూరుతాయి.