శివరాత్రి సందర్భంగా శ్రీశైలం పుణ్య క్షేత్రానికి భక్తులు తండోపతండాలుగా చేరుకుంటున్నారు. మరోపక్క శ్రీశైలం మల్లికార్జున స్వామి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శివరాత్రికి ఇక్కడ ఉండాలని వేలాది భక్తులు భారీగా తరలి వస్తున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా ఆలయ అధికారాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.