బాలీవుడ్ స్టార్, దంగల్ స్టార్ అమీర్ ఖాన్ను బీజేపీ టార్గెట్ చేసిందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. దేశంలో పరమత అసహనం పెరిగిపోతోందంటూ అమీర్ చేసిన వ్యాఖ్యలకుగాను ఈ-కామర్స్ సైట్ 'స్నాప్డీల్' అతనితో తమ కాంట్రాక్టును రద్దు చేయడం వెనుక ఏం జరిగిందో స్వాతి చతుర్వేది అనే జర్నలిస్టు తన పుస్తకం ఐయాంఎ ట్రాల్లో పేర్కొంది. దీంతో అమీర్ ఖాన్ను బీజేపీ టార్గెట్ చేసిందని ఆయన్ని దెబ్బతీయాలని భావించిందని స్వాతి చతుర్వేది వార్తలను బట్టి తెలుస్తోంది.
బీజేపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం.. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసిన ఫలితంగానే స్నాప్డీల్ తన బ్రాండ్ అంబాసిడర్గా ఆమిర్ కాంట్రాక్టును రద్దు చేసుకుందని స్వాతి చతుర్వేది తెలిపింది. ఇంకా ఆ కాంట్రాక్టును స్నాప్డీల్ పొడిగించకపోవడం గమనార్హం. దేశంలో పరమత అసహనం పెరిగిపోవడం దారుణమని 2015లో రామనాథ్ గోయెంకా అవార్డుల ఫంక్షన్లో అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సెన్సేషనల్కు దారి తీసిన సంగతి తెలిసిందే.
అయితే అరవింద్ గుప్తా ఈ ఆరోపణలను తోసిపుచ్చాడు. ఈ కుట్రకు తాము పాల్పడలేదని, సాధ్వి ఖోస్లాకు కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించాడు. ఈ విషయం తెలిసిన స్వాతి చతుర్వేది ఈ నిందను ఖండిస్తూ.. ఖోస్లాకు ఏ పార్టీతోనూ లింకులేదని, పంజాబ్లో డ్రగ్స్ మాఫియాపై ఓ డాక్యుమెంటరీ తీసిన ఖోస్లా ఇలా ఓ నిజాన్ని బయటపెడితే దానికి పొలిటికల్ టచ్ ఇస్తారా అంటూ ఆమె ఫైర్ అయ్యింది.