విమానయాన, ఫార్మా రంగాల్లోనూ 100% ఎఫ్‌డీఐలు: మోడీ సర్కారు నిర్ణయం

మంగళవారం, 21 జూన్ 2016 (09:02 IST)
విమానయాన, ఫార్మా రంగాల్లోనూ భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. రక్షణ రంగంలో ఎఫ్‌డీఐల పెంపు కోసం ప్రభుత్వం ఆయుధ చట్టం-1959కి సవరణలు చేసింది. గత యూపీఏ హయాంలోనే ఈ ప్రక్రియకు సంబంధించిన చర్చలు మొదలయ్యాయి.

అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ.. కీలకమైన రక్షణ రంగంలో నూరు శాతం ఎఫ్‌డీఐలు అనుమతించడం సబబు కాదని ఆందోళనలు చేపట్టింది. కానీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతులను మంజూరు చేసింది. 
 
ఇంకా రక్షణ, విమానయాన రంగాల్లో వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆమోదం తెలుపుతున్నట్లు కేంద్రంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కారు ప్రకటించింది. ఫార్మా సెక్టార్లోకి 74 శాతం వరకు ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఐలను ఆహ్వానిస్తున్నట్లు మోడీ సర్కారు పేర్కొంది. ఇప్పటివరకు ఈ మూడు రంగాల్లో 49 శాతం వరకు మాత్రమే ఎఫ్‌డీఐలను అనుమతించేవారని కానీ ప్రస్తుత కేంద్రం నిర్ణయంతో విదేశీ ఆయుధ కంపెనీలు భారత్‌కు వరుసకట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి