హర్యానాలోని హిస్సార్లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సోమవారం హిస్సార్ రైల్వే స్టేషన్కు సమీపంలో కాపలా లేని లెవల్ క్రాసింగ్ వద్ద పట్టాలు దాటుతున్న ట్రక్కును రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 12 మంది మృతి చెందగా మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.