అందుకు ఆమె నిరాకరించడంతో, అతను ఆమెను బలవంతంగా ఆటో లోపలికి లాక్కెళ్లాడు. వెంటనే, మరో ఇద్దరు వ్యక్తులు అతనితో పాటు వాహనంలోకి ఎక్కారు. ఈ ఆటో నగర వీధుల్లో వేగంగా వెళుతుండగా కత్తితో బెదిరించి ఆమెపై దాడి చేశారు దుండగులు.
ఆ మహిళ అరుపులు రోడ్డుపై ఉన్నవారిని అప్రమత్తం చేశాయి. వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ ఆటోను పోలీసులు వాహనాన్ని వెంబడించడం ప్రారంభించారు. కానీ వారు దానిని అడ్డుకునేలోపే, దుండగులు ఆ మహిళను రోడ్డు పక్కన పడవేసి పారిపోయారు.
ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన ఇద్దరు వ్యక్తులు ఆటో డ్రైవర్లని తేలింది. ఆమెను కిడ్నాప్ చేసిన వ్యక్తి ముత్తమిళ్ సెల్వన్, మరో వ్యక్తి దయాళన్లను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.