ఒంటరిగావున్న రిక్షా పుల్లర్ భార్యపై గ్యాంగ్ రేప్.. ఎక్కడ?

మంగళవారం, 18 ఆగస్టు 2020 (09:02 IST)
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న రిక్షా పుల్లర్ భార్యపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ లైంగికదాడి ఈ నెల 11వ తేదీన జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పాల్ఘర్ జిల్లాలోని నలసోపారాలోని  రైల్వే స్టేషన్ సమీపంలో ఓ రిక్షా డ్రైవర్ తన భార్యతో కలిసి ఓ గుడిసెలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 11న అతడు ఇంట్లో లేని సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి అతడి భార్యపై లైంగిక దాడికి తెగబడ్డారు. పైగా, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బాధితురాలిని బెదించారు. 
 
అయితే, బాధితురాలు మాత్రం ధైర్యం చేసి, తన భర్తకు చెప్పింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి నేరుగా స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు నల్లసోపారా పోలీస్ స్టేషన్ ఏఎస్‌ఐ శ్రీరాంగ్ గోసావి తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఈ నెల 20 వరకు పోలీస్‌ కస్టడీ విధించినట్లు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు