రాష్ట్రపతి వేతనంలో 30 శాతం కోత

గురువారం, 14 మే 2020 (18:04 IST)
కోవిడ్ మహమ్మారిపై పోరుకోసం ఇప్పటికే నెలసరి వేతనాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు ఇచ్చిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్.. తాజాగా నెలసరి వేతనంలో 30 శాతం కోత విధించుకునేందుకు సిద్ధమయ్యారని రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి.

ఇలా ఓ సంవత్సరం పాటు కోత విధించుకునేందుకు ఆయన స్వచ్ఛందంగా ఒప్పుకున్నారని రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి.

దీంతో పాటు ప్రయాణ ఖర్చులు, సంప్రదాయ విందుల ఖర్చులను కూడా భారీగా తగ్గించుకున్నారని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు