ఈ విషయం తెలుసుకున్న కళాశాల యాజమాన్యం ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులను కలవమని కోరింది. తదనంతరం, రాహుల్ అతని ఇంటికి వెళ్లగా, ధరణి వానియంబాడిలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది.
దీంతో తీవ్ర నిరాశకు గురైన రాహుల్ శుక్రవారం రాత్రి పెరియంగుప్పంలోని రైల్వే పట్టాలపై పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.పోలీసులు అతని మృతదేహాన్ని వెలికితీసి, ఈ విషయం గురించి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా, శనివారం ఉదయం రాహుల్ ఆత్మహత్య గురించి తెలుసుకుని, వానియంబాడి సమీపంలో ఎనిమిది నెలల గర్భవతి అయిన ధరణి ఆత్మహత్య చేసుకుంది.