తాము ఎక్కడికి వెళ్లినా అక్బర్ ఉదంతంపైనే ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తున్నదని ఇతర మంత్రులు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటివరకు అటు బీజేపీగానీ, ఇటు విదేశాంగ మంత్రి సుష్మాతోపాటు ఇతర ఏ మంత్రీ ఈ ఆరోపణలపై స్పందించలేదు.
తన కెరీర్లో టెలీగ్రాఫ్, ఏషియన్ ఏజ్, ద సండే గార్డియన్లాంటి ప్రముఖ పత్రికలకు ఆయన ఎడిటర్గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన తనను వేధించారంటూ తొలిసారి ప్రియా రమణి అనే జర్నలిస్ట్ బయటపెట్టింది. ఆ తర్వాత పలువురు ఇతర మహిళా జర్నలిస్టులు కూడా అక్బర్పై ఇలాంటి ఆరోపణలే చేశారు.