అనిల్ అంబానీ సతీమణికి కష్టాలు.. ఈడీ విచారణ

మంగళవారం, 4 జులై 2023 (15:04 IST)
Anil Ambani
విదేశీ మారక ద్రవ్య కేసుకు సంబంధించి ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ విదేశీ మారకద్రవ్య మోసానికి సంబంధించి విచారణకు హాజరు కావాలని ఆమెను కోరింది. 
 
అనిల్ అంబానీ వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు ఎనిమిది గంటల పాటు విచారణ జరిపారు. అలాగే అనిల్ అంబానీ సతీమణి దీనా అంబానీ మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారని, ఆమెను కూడా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. 
 
2020లో యెస్ బ్యాంక్ సీఈవో రాణా కపూర్‌పై అక్రమ నగదు బదిలీ కేసులో అనిల్ అంబానీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే విచారించడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు