భారత్ గెలుపు.... పాకిస్థాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్ : అమిత్ షా

సోమవారం, 17 జూన్ 2019 (13:50 IST)
ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా మాంచెష్టర్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ జట్టుపై భారత్ విజయభేరీ మోగించింది. డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తి ప్ర‌కారం కోహ్లీ సేన 89 ర‌న్స్ తేడాతో పాక్‌పై నెగ్గింది. ఈ విజయంపై భారత మాజీ క్రికెటర్లతో పాటు.. కేంద్ర మంత్రులు కూడా సోషల్ మీడియా వేదికగా అభినందనలు కురిపిస్తున్నారు. 
 
ముఖ్యంగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్‌ చేస్తూ పాక్‌పై భారత్ విజయం మరో సర్జికల్ స్ట్రైక్స్‌ అని అభివర్ణించారు. అంటే పాకిస్థాన్‌పై ఇది మ‌రో దాడి అని, దాని ఫ‌లితం కూడా అలాగే ఉంద‌న్నారు. 
 
పాక్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన టీమిండియా ఆట‌గాళ్ల‌కు షా అభినందనలు తెలిపారు. ప్ర‌తి భార‌తీయుడు ఈ విజయాన్ని ప‌ట్ల గ‌ర్వంగా ఫీలవుతున్నారనీ, ఈ విజ‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రూ సెల‌బ్రేట్ చేసుకుంటున్నార‌న్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు