ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ రెండు చోట్ల అధికారాన్ని కోల్పోగా, పుదుచ్చేరిలో మాత్రం స్వల్ప మెజార్టీతో గట్టెక్కింది. తమిళనాడులో 43 సీట్లలో పోటీ చేసి కేవలం 8 సీట్లలో మాత్రమే గెలుపొందింది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో గత సీట్లకు అదనంగా మరో రెండు సీట్లు కైవసం చేసుకుని 44 సీట్లతో సరిపుచ్చుకుంది.
ఈ ఫలితాలపై ఆయన స్పందిస్తూ... ఎన్నికల ఫలితాలు నిరాశ పరిచాయని, కానీ ఇవి ఊహించినవేనని అన్నారు. పార్టీకి పెద్ద శస్త్రచికిత్స అవసరమన్నారు. ఫలితాలపై పార్టీ ఆత్మశోధన చేసుకోవాల్సి ఉందన్నారు. ఈ ఫలితాలపై ఆత్మశోధన చేసుకుంటామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే.