పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని భారత సైనికులు సర్జికల్ దాడులు చేయగా, ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకునేలా పాకిస్థాన్ ప్లాన్ చేస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తన గగనతలానికి సంబంధించి ఆంక్షలు విధించింది.
ఈ నేపథ్యంలో, విమానంలో మంటలు వ్యాపించడంవంటి తీవ్ర పరిస్థితుల్లో మినహా... పాక్ భూభాగంలో ఎమర్జెన్సీ ల్యాండ్ కావొద్దని ఎయిర్ ఇండియా తన పైలట్లకు తెలిపింది. అయితే ఈ సూచనలను మౌఖికంగా మాత్రమే చేసింది. అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు వెళ్లే విమానాలు పాక్ మీదుగానే ప్రయాణిస్తుంటాయి.