ప్రఖ్యాత చరిత్రకారుడు బాబాసాహెబ్​ పురందరే కన్నుమూత

సోమవారం, 15 నవంబరు 2021 (11:07 IST)
Babasaheb Purandare
ప్రఖ్యాత చరిత్రకారుడు, పద్మ విభూషణ్​ బల్వంత్​ మోరేశ్వర్ పురందరే అలియాస్​ బాబాసాహెబ్​ పురందరే కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా.. మహారాష్ట్ర పుణెలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. 
 
కొన్ని రోజులుగా మహారాష్ట్ర పుణెలోని దీననాథ్​​ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం కన్నుమూశారు. బాబాసాహెబ్ పురందరేగా ప్రాచుర్యం పొందిన బల్వంత్ మోరేశ్వర్​.. కొద్దిరోజుల క్రితం న్యూమోనియా బారిన పడగా ఆయనను ఆస్పత్రికి తరలించారు.
 
అక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితి ఆదివారం విషమించగా... అత్యవసర విభాగంలో వెంటిలేటర్​పై ఉంచి, వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. కానీ సోమవారం ఆయన చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయారు.  
 
శివాజీ చరిత్ర ప్రచారంలో.. మహారాష్ట్రతో పాటు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్​ చరిత్రను ప్రచారం చేయడంలో పురందరే ప్రఖ్యాతిగాంచారు. 'రాజా శివఛత్రపతి' పేరుతో పురందరే.. 900 పేజీల పుస్తకాన్ని మరాఠీలో రచించారు. రెండు భాగాలుగా విడుదలైన ఈ పుస్తకం 1950 చివర్లో తొలిసారి ముద్రణ కాగా.. అనేక సార్లు పునర్ముద్రణకు నోచుకుంది. 
 
1980 మధ్యలో 'జనతా రాజా' పేరుతో శివాజీ చరిత్రపై ఓ నాటకాన్ని ఆయన రచించి, దర్శకత్వం వహించారు. శివాజీపై పురందరే 12వేలకు పైగా ప్రసంగాలు ఇచ్చారు. 2015లో పురందరేను మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ర భూషణ్ పురస్కారంతో సత్కరించగా.. పురందరే మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు