మానవత్వం మంటగలిసిపోతోంది. మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయనుకుంటే.. మహిళ మృతదేహాలను కూడా కామాంధులు వదిలిపెట్టట్లేదు. అలాంటి సభ్యసమాజం తలదించుకునే ఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరులో ఇద్దరు యువకులు ఓ మహిళను హతమార్చి.. ఆమె మృతదేహంతో శృంగారంలో పాల్గొన్న ఘటన కలకలం సృష్టించింది. వీరిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. పానీపూరీ షాపును నడుపుతున్న ఓ వ్యక్తి వద్ద, ఉత్తరప్రదేశ్కు చెందిన రాజీవ్ అనే యువకుడు పనిచేస్తున్నాడు. గత ఏడాది పానీ పూరీ షాపులో పనిని వదులుకున్న రాజీవ్కు రూ.7500లను షాపు యజమాని ఇవ్వాల్సి ఉంది. ఈ డబ్బు కోసం రాజీవ్ యజమాని వద్దకు తన స్నేహితుడితో కలిసి వెళ్లాడు.
ఇంట్లో పానీ పూరీ షాపు యజమాని లేకపోవడంతో పాటు.. ఆతని భార్య ఒంటరిగా ఉండటాన్ని గమనించిన రాజీవ్.. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను దోచుకోవడం మొదలుపెట్టాడు. ఇంతలో యజమాని భార్య వారికి అడ్డుపడింది. ఆగ్రహంతో ఆమెను హతమార్చారు. అంతటితో ఆగకుండా ఆ మహిళ మృతదేహంతో శృంగారానికి పాల్పడ్డారు. ఆపై పరారయ్యారు. ఈ ఘటనపై భర్త ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు.