మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. 28 రోజుల పాటు..

బుధవారం, 9 ఆగస్టు 2023 (08:24 IST)
బీహార్‌లో ఆరుగురు ఓ బాలికను 28 రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. 28 రోజుల పాటు చెరపట్టి బాలికపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. 
 
వివరాల్లోకి వెళితే.. ముజఫర్‌పూర్‌లో సరైయా పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 9న కొందరు దుండగులు కారులో వచ్చి ఓ 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. శిథిలావస్థకు చేరుకున్న ఓ భవనంలో ఆమెను బంధించి 28 రోజుల పాటు అఘాయిత్యానికి పాల్పడ్డారు.  
 
బాలిక ఆరోగ్యం విషమించడంతో ఆగస్టు 5న ఆమె తల్లికి ఫోన్ చేసి చిన్నారిని కిడ్నాప్ చేసిన విషయాన్ని వెల్లడించారు. వెంటనే అక్కడకు చేరుకున్న మహిళ తన కూతురిని ఆసుపత్రికి తరలించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు