బిపిన్ రావత్ అంత్యక్రియలు Live: అంతిమయాత్ర అక్కడి నుంచే..

శుక్రవారం, 10 డిశెంబరు 2021 (11:27 IST)
ఆర్మీ జనరల్ బిపిన్ రావత్​, మధులికా రావత్​ల భౌతిక దేహాలను గురువారం సాయంత్రం తమిళనాడు నుంచి సైనిక విమానంలో ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం వారి నివాసంలోనే భౌతిక దేహాలను ఉంచారు. 
 
శుక్రవారం పూట బిపిన్ రావత్‌ అంత్యక్రియలు జరుగనున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు సాధారణ ప్రజలు సందర్శించేందుకు వీలు కల్పించనున్నారు. 
 
ఆ తర్వాత రావత్ ఇంటి నుంచే అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. కామరాజ్ మార్గ్ ద్వారా కంటోన్మెంట్​లోని స్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర సాగనుంది. ఇప్పటికే ఈ మార్గంలో అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఆర్మీ అధికారిక లాంఛనాలతో వీరికి అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. 
 
కాగా తమమిళనాడులోని నీలగిరి జిల్లా కున్నూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో త్రిదళాధిపతి (సీడీఎస్​) జనరల్ బిపిన్ రావత్​, ఆయన సతీమణి మధులికాలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు