మహారాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఏ పార్టీతో అయినా జతకట్టేందుకు సిద్ధమని శివసేన స్పష్టం చేసింది. అవసరమైతే కాంగ్రెస్తోనూ దోస్తీ చేసేందుకు రెడీగా ఉన్నట్లు శివసేన వెల్లడించింది. 25 ఏళ్లపాటు బీజేపీతో కలసి పనిచేసిన శివసేన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసింది. కాగా మహారాష్ట్రలో మోడీ హవా బాగా పనిచేస్తోందని... శివసేన, కాంగ్రెస్ లను అధిగమించి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి.
"మహారాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని... ఏ పార్టీతో అయినా జతకట్టేందుకు సిద్ధం. ఆయా పార్టీల సిద్ధాంతాలతో మేము ఏకీభవించనప్పటికీ వారితో కలుస్తాం" అని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్తో చేయికలపడానికి కూడా తాము సిద్ధమే అన్న సంకేతాలు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీని శివసేన బద్ధ శత్రువుగా భావించింది. నరేంద్ర మోడీని పై విమర్శల వర్షం కురిపించేందుకు కూడా వెనుకాడలేదు. బీజేపీ కూడా శివసేననే ఎక్కువగా టార్గెట్ చేసింది