పక్క తడుపుతున్నాడని.. బాలుడి మర్మాంగంపై వాతలు

సోమవారం, 1 మార్చి 2021 (10:10 IST)
బాలుడు పక్క తడుపుతున్నాడనే కారణంతో పైశాచికంగా ప్రవర్తించారు ఆ దుర్మార్గులు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వారు.. బాలుడి పట్ల క్రూరంగా వ్యవహరించారు ఆ తల్లిదండ్రులు. ఇలా చేసిన ఓ వ్యక్తి, అతని రెండో భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. బాలుడి బయోలాజికల్ తల్లి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. థానేలోని వాగ్లే ఎస్టేట్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన రెండో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడు తన మొదటి భార్యకు పుట్టిన కొడుకును(9) తన వద్దే ఉంచుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే రోజు రాత్రి సమయంలో ఆ బాలుడు పక్క తడిపేస్తున్నాడని ఆగ్రహం తెచ్చుకున్నారు. తెలిసి తెలియక చేసిన తప్పుకు అతన్ని దారుణంగా కొట్టారు. బాలుడి మర్మాంగంపై వాతలు కూడా పెట్టి పశువుల్లా ప్రవర్తించారు. 
 
ఈ విషయం తెలుసుకున్న బాలుడి అసలు తల్లి.. పోలీసులను ఆశ్రయించింది. తన కొడుకుపై జరిగిన దాడి గురించి పోలీసులకు వివరించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అరెస్ట్ చేయలేదని ఓ పోలీస్ అధికారి తెలిపారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు