ప్రేమిస్తున్న అమ్మాయి రాఖీ కట్టేందుకు వచ్చింది.. అంతే దూకేశాడు..

బుధవారం, 29 ఆగస్టు 2018 (17:32 IST)
ప్రేమిస్తున్న అమ్మాయి రాఖీ కట్టేందుకు వచ్చింది.. అంతే యువకుడు భవనం నుంచి దూకేసింది. త్రిపుర రాజధాని అగర్తాలాలో ఈ ఘోరం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అగర్తాలాలో స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు పాఠశాలలో దిలీప్ కుమార్ షా(18) అనే యువకుడు పన్నెండో తరగతి చదువుతున్నాడు. అదే పాఠశాలకు చెందిన ఓ అమ్మాయిని దిలీప్ గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు, అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి ఆమెతో దిలీప్‌కు రాఖీ కట్టించేందుకు యత్నించారు. యువతిని బలవంతంగా దిలీప్ వద్దకు తీసుకువచ్చి రాఖీ కట్టాలంటూ బెదిరించారు. దీంతో భయపడిపోయిన యువకుడు పాఠశాల భవనంలోని రెండో అంతస్తు నుంచి దూకేశాడు. దాంతో దిలీప్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 
 
దీన్ని గమనించిన వారు వెంటనే దిలీప్‌ను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇలా అన్యాయంగా తమ కుమారుడిని బెదిరింపులకు పాల్పడిన టీచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి తల్లిదండ్రులు పాఠశాల ముందు నిరసనకు దిగారు. పోలీసులు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు